వేములవాడలో ప్రారంభమైన దేవీనవరాత్రులు

వేములవాడలో ప్రారంభమైన దేవీనవరాత్రులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీప స్థాపన, కలశస్థాపన గాయత్రి ప్రతిష్ట చేశారు పురోహితులు. 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం, ఐదుగురు రుత్విక్కులతో గాయత్రి హవనం చేశారు. రాజరాజేశ్వరస్వామి వారికి, శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి మహన్యాస పూర్వక ఏకదాశ  రుద్రాభిషేకం నిర్వహించారు.