- గప్చుప్గా 80 మందికే టెస్ట్ పెట్టే ప్రయత్నం
- 24 వేల మంది స్టూడెంట్లకు నష్టం జరిగేలా చర్యలు
- ‘వీ6’ వార్తతో వెనక్కి తగ్గిన సర్కారు
- ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం రాత్రి ప్రకటన
హైదరాబాద్, వెలుగు: కరోనా బారినపడి ఎంసెట్ (ఇంజినీరింగ్) రాయని స్టూడెంట్లకు ఎగ్జామ్విషయంలో ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, వెబ్సైట్లోనూ ప్రకటించకుండా.. గప్చుప్గా కేవలం 80 మందికి శనివారం టెస్టు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విషయం ‘వీ 6’ బయటపెట్టడంతో వెనక్కితగ్గారు. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రకటించారు. జేఎన్టీయూలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఎప్పుడు నిర్వహించేది వెబ్సైట్లో తెలియజేస్తామని ‘వెలుగు’తో చెప్పారు.
అప్పట్లో ఇంటిమేషన్ ఇస్తామని చెప్పి..!
వాస్తవానికి మే నెలలో ఎంసెట్ జరగాలి. కానీ కరోనా ఎఫెక్ట్తో సెప్టెంబర్కు వాయిదా పడింది. సెప్టెంబర్ 9 నుంచి 14 వరకూ ఎంసెట్ ఇంజినీరింగ్.. సెప్టెంబర్ 28, 29న అగ్రికల్చర్ ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించారు. అయితే కరోనా పాజిటివ్ పేషెంట్లు, ఆ లక్షణాలు ఉన్న వాళ్లు, క్వారంటైన్లో ఉన్న వాళ్లు ఎంసెట్కు రావొద్దని, వారికి తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తామని అప్పట్లో సెట్ఆఫీసర్లు బహిరంగంగా ప్రకటించారు.అయితే కరోనా పాజిటివ్ పేషెంట్లు, ఆ లక్షణాలు ఉన్న వాళ్లు, క్వారంటైన్లో ఉన్న వాళ్లు ఎంసెట్కు రావొద్దని, వారికి తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తామని అప్పట్లో సెట్ఆఫీసర్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వాళ్లు చాలా మంది ఎగ్జామ్కు రాలేదు. కొందరు హైఫివర్, జలుబు ఉండి ఎగ్జామ్ సెంటర్కు వస్తే వారిని ఆఫీసర్లు వెనక్కి పంపించేశారు. తమకు దగ్గు, ఫివర్, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని సెల్ఫ్డిక్లరేషన్ ఇచ్చిన స్టూడెంట్లను మాత్రమే సెంటర్లలోకి అనుమతించారు. అప్పట్లో ఇంత తంతు నిర్వహించిన ఎంసెట్ నిర్వాహకులు.. మళ్లీ పరీక్ష నిర్వహించే విషయంలో ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ప్రకటన చేయకుండా శనివారం గప్చుప్గా కొందరికి మాత్రమే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
24 వేల మంది రాయలేదు
సెప్టెంబర్లో జరిగిన ఎంసెట్ (ఇంజినీరింగ్) కు మొత్తం 1,43,330 మంది హాజరుకావాల్సి ఉండగా.. 1,19,187 మందే హాజరయ్యారు. 24,143 మంది ఎగ్జామ్ రాయలేదు. వీరిలో కరోనా పాజిటివ్ స్టూడెంట్లతో పాటు పేరెంట్స్కు, బంధువులకు పాజిటివ్ వచ్చి సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న స్టూడెంట్లూ చాలా మంది ఉన్నారు. వీరందరికీ సమాచారం ఇచ్చి మళ్లీ విడిగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. హెల్ప్డెస్క్కు కాల్ చేసి పేర్లు నమోదు చేసుకున్న కేవలం 80 మంది ఇంజనీరింగ్ విభాగం వారికి శనివారం టెస్టు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. ఆ 80 మందికి ఈ నెల1,2 తేదీల్లో మెసేజ్ల రూపంలో సమాచారం ఇచ్చినట్లు వారు చెప్తున్నారు. తాము హెల్ప్డెస్క్కు ఫోన్చేసినా సరైనా సమాచారం ఇవ్వలేదని, తమకు తెలియకుండా పరీక్ష పెట్టాలని చూడటం ఏమిటని ఇతర స్టూడెంట్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కరోనా సెల్ఫ్డిక్లరేషన్ను వెబ్సైట్లో పెట్టిన ఆఫీసర్లు.. ఎగ్జామ్ ఉందనే విషయాన్ని వెబ్ సైట్లో పెట్టకపోవడం ఏమిటని స్టూడెంట్ల తల్లిదండ్రులు ప్రశ్నించారు. కొందరు పొలిటికల్ లీడర్ల పిల్లల కోసమే ఇలా స్పెషల్గా ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. వ్యవహారాన్ని శుక్రవారం సాయంత్రం ‘వీ 6’ బయటపెట్టింది. దీంతో దిగివచ్చిన ఆఫీసర్లు.. టెస్టును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.