యావత్ పార్టీ సోనియా, రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటోంది

యావత్ పార్టీ సోనియా, రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటోంది

భారత జాతిని ఐక్యంగా నిబెట్టే శక్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి మాత్రమే ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యావత్ పార్టీ ఆ ఇద్దరి నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. అంతర్గతంగా సూచనలు చేసే అవకాశం ఉన్నా కొందరు బహిరంగంగా లేఖలు రాయాడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారన్నారు. పదవుల కోసం వారు రాజకీయాల్లోకి రాలేదన్నారు. అవకాశం ఉండి కూడా సోనియాగాంధీ, రాహుల్ పదవులు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ ఐక్యత భారత జాతి ఐక్యత అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.