బ్రేక్ వేయబోయి.. యాక్సలరేటర్​ తొక్కిన డాక్టర్

బ్రేక్ వేయబోయి.. యాక్సలరేటర్​ తొక్కిన డాక్టర్
  •     లంగర్​హౌస్​లో కారు ఢీకొని నలుగురికి గాయాలు

మెహిదీపట్నం :  కారు బ్రేక్​వేయబోయి.. ఓ డాక్టర్​ యాక్సలరేటర్ ​తొక్కాడు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటున్న ముగ్గురు గాయపడ్డారు. లంగర్​హౌస్​బాపూఘాట్​తపోవనం వద్ద శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్​స్పెక్టర్ రఘు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్​లో పనిచేస్తున్న డాక్టర్​రోహిత్ కన్నా రోజూలాగే శుక్రవారం డ్యూటీకి వెళ్లాడు.

సాయంత్రం తర్వాత కారులో తిరిగి ఇంటికి బయలుదేరాడు. లంగర్ హౌస్ తపోవనం వద్ద బ్రేక్​వేయబోయి, యాక్సలేటర్​ తొక్కొడు. రోడ్డు పక్కన ఫుట్​పాత్ పండ్లు అమ్ముకుంటున్న తరుణ్(20), తౌఫిక్(28), సోహెల్(35)పైకి కారు దూసుకెళ్లింది. తరుణ్, తౌఫిక్​స్వల్పంగా గాయపడగా, సోహెల్ తలకు తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ రోహిత్ కన్నా బ్రేక్​బదులు,  యాక్సలరేటర్​తొక్కడంతో ప్రమాదం జరిగిందని ఇన్​స్పెక్టర్​తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ రకాల పండ్లు చల్లాచెదురుగా పడ్డాయి.  బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.