పంజాగుట్ట, వెలుగు : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్పై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో చీటింగ్కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేటకు చెందిన ఎస్.కిరణ్కుమార్బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్ టికెట్కోసం కేఏ పాల్ను సంప్రదించాడు. టికెట్ కేటాయించేందుకు కేఏ పాల్ అతని నుంచి రూ.50లక్షలు తీసుకున్నాడు.
ఈ మేరకు కిరణ్కుమార్ గురువారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.30లక్షలు ఆన్లైన్ట్రాన్స్ఫర్చేశారని, రూ.20లక్షలు పలు దఫాలు ఇచ్చానని పేర్కొన్నాడు. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా.. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఎన్నిసార్లు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని చెప్పాడు. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
