ఊహించని ట్విస్ట్.. అక్క భర్తతో పారిపోయిన చెల్లెలు

ఊహించని ట్విస్ట్.. అక్క భర్తతో పారిపోయిన చెల్లెలు

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్ర సంఘటన జరిగింది. సొంత అక్క భర్తతోనే ఓ బాలిక పారిపోయింది. స్థానికంగా నివసించే ఓ 15 ఏళ్ల బాలిక తన అక్క భర్తతో కలిసి గుజరాత్ పారిపోయింది. ఈ ఘటనపై బాలిక అక్క.. పంచాయతీ పెద్దలను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్తతో సంబంధం పెట్టుకొని తన చెల్లి ఇలా చేసిందని బాలిక అక్క పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. అక్క ఫిర్యాదుతో పారిపోయిన ఇద్దరినీ.. పంచాయతీ పెద్దలు గుజరాత్‌లో పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చారు. పంచాయతీ పెద్దల నిర్ణయం ప్రకారం.. బాలికను ఆమె తల్లిదండ్రులు మన్నవార్ మండలానికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి విక్రయించడానికి ఒప్పుకున్నారు. అందుకుగాను రూ. 1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ మొత్తంలో రూ. 5 వేలు కుల పెద్దలకు, మరో రూ. 5 వేలు పంచాయతీ పెద్దల దావత్‌కు గాను తీసిపెట్టారు. మిగతా మొత్తంలో కూడా కొంత డబ్బును ఇప్పటికే బాలిక తల్లిదండ్రులకు ఆ వ్యక్తి ముట్టజెప్పాడు.

ఈ ఘటన తమ దృష్టికి వచ్చినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ తెలిపారు. అధికారికంగా ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు.

గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తన బావతో కలిసి పారిపోయిందని జిల్లా చైల్డ్‌లైన్ సభ్యుడు పంకజ్ జైన్ తెలిపారు. బాలికను తీసుకొచ్చి అమ్మకానికి పెట్టారని తెలిసి.. బాలికను రక్షించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలిక చైల్డ్ షెల్టర్ హోంలో ఉన్నట్లు జైన్ తెలిపారు. కాగా.. బాలిక చదువుకోవాలనుకుంటున్నదని.. అదే సమయంలో ఆమె తన బావతో కలిసి ఉంటానని అంటున్నదని జిల్లా చైల్డ్ లైన్ ప్రతినిధి తెలిపారు.