అమరావతి, వెలుగు: ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు ఐదో రోజూ రిలే నిరాహార దీక్షలు, రహదారి దిగ్బంధం, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఆదివారం తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో 29 గ్రామాల రైతులు ధర్నా చేశారు. రైతులతోపాటు వారి కుటుంబసభ్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు. “ప్రాణాలైనా అర్పిస్తాం అమరావతిని సాధిస్తాం, 3 రాజధానులు వద్దు అమరావతే ముద్దు. రాజకీయాల కోసం రైతులను బలిచేస్తారా?’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ గుంటూరు నుంచి అమరావతి చేరుకునే రోడ్లను దిగ్బంధించారు. నల్ల జెండాలు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మందడం ప్రధాన రహదారిపై రైతులు పడవను అడ్డంగా ఉంచారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న పడవను తొలగించారు. రిలే నిరాహార దీక్షకు టెంట్ వేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. మందడంలో నిర్వహించిన ధర్నాలో అమరావతి విట్ క్యాంపస్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఉద్దండరాయునిపాలెంలో రైతులు వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ రైతు చెప్పుల దండను మెడలో వేసుకుని నిరసన తెలిపాడు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ సచివాలయానికి టీడీపీ కార్యకర్తలు నల్లరంగు వేస్తారన్న అనుమానంతో భారీగా పోలీసులను మోహరించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూస్తే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏసీ గదుల్లో కూర్చొని అమరావతి భూములు వెనక్కిచ్చేస్తామని మాట్లాడుతున్న మంత్రులు రాజధాని గ్రామాల్లోకి వచ్చి మాట్లాడాలన్నారు. అమరావతిని పరిపాలన రాజధాని చేస్తామన్న ప్రభుత్వం చివరికి పోలీసు రాజ్యం చేసిందని రైతులు మండిపడ్డారు. అమరావతిని కాపాడుకునేందుకు ఆమరణ దీక్షకు దిగుతామని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.
అమరావతిని పోలీసు రాజ్యం చేశారు
- ఆంధ్రప్రదేశ్
- December 23, 2019
లేటెస్ట్
- దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే?
- వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు