యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో అపశృతి.. నలుగురికి గాయాలు

యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో అపశృతి.. నలుగురికి గాయాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. YTDA అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి ప్రెసిడెంట్  సూట్ స్లాబ్ కుప్పకూలింది. దీంతో అక్కడే పని చేస్తున్న నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. గాయపడిన వారు శ్రీకాకుళం, మహబూబ్ నగర్ వాసులుగా గుర్తించారు.