శ్రీనివాస్​రెడ్డికి ఉరిశిక్ష వేయండి

శ్రీనివాస్​రెడ్డికి ఉరిశిక్ష వేయండి

నల్గొండ టౌన్​, వెలుగు: ముగ్గురు బాలికలను రేప్​ చేసి చంపేసిన మర్రి శ్రీనివాస్​రెడ్డికి ఉరిశిక్ష విధించాలని స్పెషల్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ చంద్రశేఖర్​ కోర్టును కోరారు. మంగళవారం నల్గొండలోని పోక్సో స్పెషల్​ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్​ తరఫున ఆయన వాదనలు వినిపించారు. శ్రీనివాస్​రెడ్డికి వ్యతిరేకంగా 101 సాక్ష్యాలున్నాయని, మూడు కేసులను అసాధారణమైనవిగా గుర్తించి నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్నారు.

ఆయన వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం డిఫెన్స్​ తరఫున వాదనలు పూర్తయిన తర్వాత శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా, శ్రీనివాస్​రెడ్డికి వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేస్తూ లాయర్లు కోర్టు ఆవరణలో  ఆందోళన చేశారు.