అక్రమంగా ఆవుల తరలింపు.. పట్టుకున్న గోరక్ష దళ్ సభ్యులు

అక్రమంగా ఆవుల తరలింపు.. పట్టుకున్న  గోరక్ష దళ్ సభ్యులు

హైదరాబాద్: శంషాబాద్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గోరక్ష దళ్ సభ్యులు, TRS నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతకుముందు అక్రమంగా తరలిస్తున్న 27 ఆవులను పట్టుకున్నారు గోరక్ష దళ్  కార్యకర్తలు. పోలీసులకు సమాచారమిచ్చి వాటిని గోశాలకు తరలించాలని పట్టుబట్టారు. అక్కడకు వచ్చిన TRS కౌన్సిలర్ భర్త.. గోవులను తరలిస్తున్న వ్యక్తులకు మద్దతుగా మాట్లాడారు.  గోరక్ష దళ్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కలుగజేసుకుని వారిని సముదాయించారు.

ఆవులను జగిత్యాల నుండి కర్నూల్ కు.. అక్కడినుండి బాంగ్లాదేశ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు గో రక్షక్ సభ్యులు. లారీలో 50 ఆవులు ఉన్నట్టు తెలిపారు.  ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గో రక్షక్ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.