కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినప్పటికీ కొత్త వేరియెంట్స్ వస్తుండడంతో మళ్లీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతో వాటిని సమర్థంగా అడ్డుకునే యాంటీబాడీస్ గురించి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్లోని ‘టెల్ అవివ్ యూనివర్సిటీ’కి చెందిన సైంటిస్ట్లు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో రెండు రకాల యాంటీ బాడీస్ను గుర్తించారు వీళ్లు. ఈ యాంటీ బాడీస్... అన్ని కరోనా వేరియెంట్ల నుంచి దాదాపు 95 శాతం రక్షణ ఇస్తాయని చెప్తున్నారు సైంటిస్ట్లు. ‘కమ్యూనికేషన్స్ బయాలజీ’ అనే జర్నల్లో ఈ స్టడీ పబ్లిష్ అయింది.
కరోనా నుంచి కోలుకున్న టిఎయు–1109, టిఎయు–2310 అనే యాంటీబాడీస్ గుర్తించారు సైంటిస్ట్లు. ఇవి కరోనా వైరస్లో స్పైక్ ప్రొటీన్కు అతుక్కొని డెల్టాప్లస్, ఒమిక్రాన్ వైరస్ల పనితీరుని దెబ్బతీయడం గమనించారు. దాంతో ఈ రెండు రకాల యాంటీబాడీస్ని కరోనా వచ్చినవాళ్లకు ఎక్కిస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ ఉండదు.
ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్లు, డయాబెటిస్, ఒబెసిటీ, ఎక్కువ కాలం అనారోగ్యంతో బాధ పడుతున్నవాళ్లకు ఈ యాంటీబాడీస్ ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు సైంటిస్ట్లు. ‘‘టిఎయు–1190 యాంటీబాడీస్ డెల్టాప్లస్ వేరియెంట్ని 92 శాతం, ఒమిక్రాన్ వేరియెంట్ని 90 శాతం అడ్డుకుంటాయని చెప్పింది ఈ రీసెర్చ్లో పాల్గొన్న నటాలియా ఫ్రండ్ అనే సైంటిస్ట్.