కరోనా వైరస్ కట్టడి భాద్యత ప్రజలదే: యడ్యూరప్ప

కరోనా వైరస్ కట్టడి భాద్యత ప్రజలదే: యడ్యూరప్ప

బెంగళూరు నగరంలో సంపూర్ణ లాక్ డౌన్ ఇవాళ్టితో(జులై-22) ముగియనుంది. కంటోన్మెంట్ జోన్లు మినాహా మిగిలిన చోట్ల యథావిథిగా అన్ని కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కర్నాటక సీఎం యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలనీ…. కరోనా కేసులు పెరగకుండా వారే బాధ్యత వహించాలనీ అన్నారు. మరో మారు లాక్ డౌన్ విధించే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రనక, పగలనక పని చేసిందని చెప్పిన ఆయన, వైరస్ కట్టడి ఇక మా  చేతుల్లో లేదని స్పష్టం చేశారు.