నిరుద్యోగులపై కేసులు ఎత్తేయాలి

నిరుద్యోగులపై కేసులు ఎత్తేయాలి

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఘటనలో నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్​ చేశారు. నిరసన లో జరిగిన ఆస్తి నష్టాన్ని చూస్తున్నారే తప్ప, దేశంలో పెరిగిన నిరుద్యోగ తీవ్రత ను అర్థం చేసుకోవడం లేదని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్​ స్టేట్​ ఆఫీసులో శనివారం కోదండరాం మీడియాతో  మాట్లాడారు. ఫిజికల్ టెస్ట్ లు పూర్తి చేసుకుని రిక్రూట్మెంట్ కు రెడీ గా ఉన్న టైంలో నోటిఫికేషన్​ రద్దు చేస్తే ఎట్లా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు పద్ధతి లో రిక్రూట్మెంట్ చేపట్టడం సిగ్గుచేటన్నా రు. ఆందోళనకారులపై కాల్పులు జరపడం పద్ధతికాదని మండిపడ్డారు. అగ్నిపథ్​ను వెనక్కి తీసుకోవాలని, ఫైరింగ్​కు కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.