పాల ధర రూ.12 పెంపు

పాల ధర రూ.12 పెంపు

పాల ధరలు పెంచాలని నిర్ణయించారు మధ్యప్రదేశ్ లోని పాల ఉత్పత్తిదారులు. రత్లాంకు చెందిన రైతులు పాల ధర లీటరుకు రూ.12 చొప్పున పెంచాలని నిర్ణయించారు. గతేడాది లీటర్‌కు రూ.2 పెంచాలని అనుకున్నా… కరోనా కారణంగా పెంచలేకపోయామని తెలిపారు.

ఈ ఏడాది పెట్రోల్‌, డీజిల్‌తో పాటు దాణా ధరలు బాగా పెరిగాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం లీటరు పాలు రూ. 43కు అమ్ముతున్నామని.. మార్చి 1 నుంచి రూ.55 చొప్పున అమ్మాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు. రత్లాంలో జరిగిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో..దాదాపు 25 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు.