జులై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

జులై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు

రాష్ట్ర వ్యాప్తంగా జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్..70 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఏడేళ్ళలోనే చేసి చూపించామన్నారు.

మరోవైపు ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని తెలిపారు కేటీఆర్. 57 ఏళ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వచ్చిందన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు కేటీఆర్.