కొత్త ధరణిలో పాత పేర్లు.. అమ్మిన భూమిని మళ్లీ అమ్మేందుకు యత్నాలు

కొత్త ధరణిలో పాత పేర్లు.. అమ్మిన భూమిని మళ్లీ అమ్మేందుకు యత్నాలు

మ్యుటేషన్లు కాకపోవడంతో మళ్లీ అమ్మేందుకు ప్రయత్నాలు

ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు
ఆందోళనలో కొనుగోలుదారులు

ఖమ్మం రూరల్​ తహసీల్దార్​ కమ్ ​జాయింట్ ​సబ్ ​రిజిస్ర్టార్ ​ఆఫీసులో ఓ వ్యక్తి స్లాట్​బుక్​ చేసుకుని మంగళవారం రిజిస్ట్రేషన్​కు వచ్చాడు. అతని అమ్మమ్మ  పేరుమీద ఉన్న 0.11కుంటల అగ్రికల్చర్​ ల్యాండ్​ను గతంలో ఒకరికి విక్రయించారు. కొనుగోలు చేసినవాళ్లు రిజిస్ట్రేషన్​ చేసుకున్నా, మ్యుటేషన్​ కాలేదు. కొత్తగా వచ్చిన ధరణిలో వృద్ధురాలి పేరే ఉండడంతో దీనిని ఆసరాగా చేసుకున్న అతగాడు కొందరిని వెంటబెట్టుకొని తహసీల్దార్​ ఆఫీస్​కు వచ్చాడు. మరో పదినిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​ పూర్తవుతాయనగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి కొన్నవారికి సమాచారం ఇచ్చాడు. వాళ్లు వెంటనే అలర్ట్​ అయి తహసీల్దార్​కు ఫోన్​లో కంప్లైట్​ చేయడంతో మ్యుటేషన్​ నిలిపివేశారు.

ఖమ్మం రూరల్​, వెలుగు: స్టేట్​వైడ్ గా​ సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్​లో లోపాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ధరణి రాక ముందు అగ్రికల్చర్​ ల్యాండ్స్ కొనుగోలు చేసినవాళ్లలో చాలామంది రిజిస్ట్రేషన్​చేయించుకున్నప్పటికీ మ్యుటేషన్​కాలేదు. ఇలాంటి అప్లికేషన్లు తహసీల్దార్​ఆఫీసుల్లో వేలల్లో పెండింగ్​లో ఉన్నాయి. ధరణిని అప్​డేట్​చేసే క్రమంలో ఇలాంటి మ్యుటేషన్లన్నింటినీ ముందే పూర్తి చేసి కొన్నవాళ్ల పేర్లు ఎక్కించాల్సిన ఆఫీసర్లు ఆ పని చేయలేదు. దీంతో  ధరణి పోర్టల్​లో పాత వాళ్ల పేర్లే వస్తుండడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం పలుచోట్ల ఇలాంటి సమస్యలు బయటపడగా, వాటిపై ఆఫీసర్లకు క్లారిటీ లేకుండా పోయింది.

వేల మ్యుటేషన్లు పెండింగ్​లో..

పాత రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్​ ల్యాండ్​ను మొదట సబ్​రిజిస్ట్రార్​ఆఫీసులో రిజిస్ర్టేషన్​ చేసుకొని, కొనుగోలుదారుని పేరు మీద మ్యుటేషన్​ చేసుకునేందుకు మీ సేవలో అప్లై చేసుకునేవారు. తర్వాత వీఆర్​వో, ఆర్ఐ ఫీల్డ్​ లెవల్​లో పరిశీలించి రిపోర్ట్​ ఇస్తే  వాటి ఆధారంగా తహసీల్దార్​ మ్యుటేషన్​ చేసేవారు. రిజిస్ట్రేషన్​ గంటల వ్యవధిలో పూర్తయితే మ్యుటేషన్​కు నెలలు పట్టేది. దీంతో ధరణి పోర్టల్​కు ముందు మ్యుటేషన్​ కోసం అప్లై చేసుకున్న వేలాది మంది దరఖాస్తులు పెండింగ్​లో ఉండిపోయాయి. ఈ క్రమంలో గత నెలలో తెలంగాణ ప్రభుత్వం స్టేట్​వైడ్​అగ్రికల్చర్, నాన్​అగ్రికల్చర్​భూముల రిజిస్ర్టేషన్లను, రెవెన్యూలో ఉన్న ఆన్​లైన్​సేవలను నిలిపివేసింది. కాగా, ధరణిలో అప్​లోడ్​ చేసేముందే ఇలాంటి పెండింగ్​మ్యుటేషన్లను క్లియర్​చేసి, కొనుగోలు చేసినవారి పేర్లను ఎక్కించాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ప్రస్తుతం ఆన్​లైన్​లో పాతవాళ్ల పేర్లే వస్తున్నాయి. ధరణికి ముందు భూములు అమ్మినవారి పేర్లే ప్రస్తుతం పోర్టల్​లో ఉండడం, తహసీల్దార్​ ఆఫీసుల్లో ఆ భూములను పదిహేను నిమిషాల్లో ఇతరుల పేర్లపైకి  మ్యుటేషన్​ చేసే అవకాశం ఉండడంతో భయపడుతున్నారు. కాగా, దీనిపై తహసీల్దార్లకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఇలాంటి కేసులు వస్తుండడంతో పై ఆఫీసర్లకు రిపోర్ట్​ చేస్తున్నారు.  త్వరలోనే దీనికో పరిష్కారం లభిస్తుందని చెబుతున్నా కొనుగోలుదారులు మాత్రం తలపట్టుకుంటున్నారు.

నా రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్​ పనికిరాదట

నేను 8 నెలల క్రితం ఎకరం వ్యవసాయ భూమి కొనుగోలుచేసి  రిజిస్ర్టేషన్​ చేసుకున్న. మ్యుటేషన్​కోసం ఆన్​లైన్​లో  దరఖాస్తు చేసినా రెవెన్యూ ఆఫీసర్లు ఇంతవరకు పాస్​బుక్​ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ధరణిలో నా పేరు కాకుండా పాతవాళ్ల పేరే ఉంది. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ పనికిరాదని కొంతమంది అంటున్నారు. నాకు భయంగా ఉంది. ఆఫీసర్లు వెంటనే నాకు పాస్​బుక్​ఇప్పించాలె.

– గుత్తికొండ సీతారాములు, కొనుగోలుదారుడు

పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినం

గతంలో రిజిస్ర్టేషన్​ చేసుకొని పాస్​బుక్​లు పొందని రైతులు చాలామంది ఉన్నారు. కానీ ధరణిలో పాత పట్టాదారుల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై కొనుగోలుదారుల్లో ఆందోళన కనిపిస్తోంది.  ధరణిలో క్రయ, విక్రయాలు జరుగుతున్నందున కొనుగోలుదారులు అలర్ట్​గా ఉండాలి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారం ముందుకెళ్తాం.

– శ్రీనివాసరావు,  ఖమ్మం రూరల్ తహసీల్దార్, జాయింట్​ సబ్​రిజిస్ర్టార్​

For More News..

అధికారులు.. మా మాట వినాల్సిందే

క్షమాభిక్ష పిటిషన్‌‌ రెండేండ్లుగా పెండింగ్

‘కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి’ పై కేసు నమోదు