హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం

హైదరాబాద్‌లో కుప్పకూలిన పురాతన భవనం

హైదరాబాద్‌లో ఓ పురాతన భవనం శనివారం కుప్పకూలింది. నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న మొఘల్‌షరాఫ్‌ భవనం కూలిపోయింది. భవనం కూలడంతో అందులో ఉంటున్న పలువురు గాయాలబారిన పడటంతో పాటు మరికొందరు.. శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.