
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopalvarma) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy)ని కలిశారు. ఈ సందర్బంగా ఆయనతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రతీ సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) జన్మదినం సందర్భంగా మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిపేందుకు డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం మే 4 కాకుండా మే 19న జరుపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఉన్న కొంతమంది డైరెక్టర్స్ కలిసి ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి ఆహ్వానం అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు పలువురు దర్శకులు వెళ్లారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి ఆహ్వానం అందించారు.
Visited my dear friend and FIRECRACKER @revanth_anumula the HONOURABLE CHIEF MINISTER of TELANGANA ??? pic.twitter.com/sY2cQQ5ukJ
— Ram Gopal Varma (@RGVzoomin) May 18, 2024
ఇక్కడ విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్లిన వారిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. సాధారణంగా ఆర్జీవీ ఇలాంటి కార్యక్రమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. అలాంటిది ఆయనే స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించడం చర్చనియ్యాంశంగా మారింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా ప్రియ మిత్రుడు, ఫైర్ క్రాకర్ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాను.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.