పాపికొండలు: 38రోజుల క్రితం మునిగిన బోటును బయటకు తీశారు

పాపికొండలు: 38రోజుల క్రితం మునిగిన బోటును బయటకు తీశారు

ఆంధ్ర ప్రదేశ్: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో (పాపికొండలు) గత నెల మునిగిన బోటును బయటకు తీశారు. ఇందులో 5మృతదేహాలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. దర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి గుంజుకొచ్చారు. ఈ ప్రమాదంలో 26మంది పర్యాటకులు ప్రాణాలతో బయటపడగా 39మంది చనిపోయారు. ఇప్పటి వరకు 12మంది ఆచూకీ తెలియలేదు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఇప్పుడు దొరికిన ఐదు మృతదేహాలను గుర్తు పట్టడం కష్టంగా ఉందని తెలిపారు అధికారులు. 38 రోజులుగా నీటిలో ఉండటంతో కుళ్లిపోయాయని చెప్పారు. బోటులో మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.