జనం మనసులు గెల్చుకున్నా: తెలంగాణ బాక్సర్

జనం మనసులు గెల్చుకున్నా: తెలంగాణ బాక్సర్

ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ లో భాగంగా మేరీకోమ్ తో పోటీలో తాను ఓడినా.. జనం మనసులు గెల్చుకున్నానని చెప్పింది తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్. మేరీకోమ్ తో ఫైట్ కోరి.. తాను తప్పుచేశానని అనుకోవడం లేదంది. బౌట్ లో తాను బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్టు చెప్పింది.

రింగ్ లో మేరీకోమ్ తనను దుర్భాషలాడిందనీ.. తాను హగ్ ఇచ్చినా తిరస్కరించిందని చెప్పింది. ఐనా తాను అవేమీ పట్టించుకోదల్చుకోలేదని చెప్పిన నిఖత్ జరీన్.. మేరీకోమ్ ఓ లెజెండ్ అని చెప్పింది.