ప్రశాంతంగా శ్రీరామనవమి శోభాయాత్ర

ప్రశాంతంగా  శ్రీరామనవమి శోభాయాత్ర

హైదరాబాద్ : శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతోందన్నారు హైదరాబాద్ సీసీ CV ఆనంద్. కోర్టు అనుమతి తో రెండు కొత్త మార్గాల్లో శోభాయాత్రను అనుమతించామన్నారు. కార్వాన్, బేగంపేట మార్గాల్లో కొత్తగా యాత్రలు కొనసాగుతాయన్నారు. రంజాన్ మాసం కావడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా మాత పెద్దలతో మాట్లాడి సమన్వయం చేసామన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు శోభాయాత్ర జరగలేదని కార్యకర్తలు శోభాయాత్రలో పాల్గోనేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. 

శోభాయాత్ర మొత్తాన్ని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు.  7వేల మంది పోలీసులు  శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.  మహిళల రక్షణ కోసం షీ టీంస్ కూడా ఉన్నాయని… సోషల్ మీడియాపై   ప్రత్యేక దృష్టి పెట్టామని సీవీ ఆనంద్ చెప్పారు. వివాదాస్పద, రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు సీపీ ఆనంద్.