ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమం

ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ సారి ఒకే రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నట్లు తెలిపింది. మొత్తం 38 లక్షల మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ పంపిణీ చేయనున్నట్లు చెప్పింది. అప్పుడే పుట్టిన పిల్లలు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ ఈ మందు వేయనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 23,231 బూత్‌లు, 830 సంచార వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పింది. సంచార వాహనాల ద్వారా.. ఇటుకబట్టీలు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉండే ప్రాంతాలు, హైరిస్క్‌ బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రైల్వే, బస్‌, మెట్రోస్టేషన్లలో 750 ప్రాంతాల్లో పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రోస్టేషన్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

ఈ నెల 19న పోలియో డ్రాప్స్ వేయించుకోని పిల్లలను గుర్తించేందుకు 20, 21 తేదీల్లో ఇంటింటికీ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.