మాదాపుర్ ఖానామేట్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ప్రముఖ నిర్మాత స్థలాన్ని ఆక్రమించేందుకు దుండగులు యత్నించారు. అడ్డుకోవడానికి వచ్చిన నిర్మాత అనుచరులపై సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు సంజీవ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్థలం ఆక్రమణకు సంబంధించిన విషయంపై నిర్మాత సూపర్ వైజర్ ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరు వర్గాలను స్థలాన్ని ఖాళీ చేయాలని మాదాపూర్ పోలీసులు చెప్పారు. మధ్యాహ్నం మళ్లీ రామకృష్ణ రెడ్డితో సహా కొంత మంది నిర్మాత స్థలం దగ్గరకు వెళ్లారు. దీంతో నిర్మాత అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా దుండగులు దాడికి దిగారు. దాడి నుంచి తప్పించుకోవడానికి సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి అతని వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. రివాల్వర్ ను అక్రమంగా ఉంచుకున్నందుకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ కు లైసెన్సు ఉందా లేదా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.