రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కారు, బైకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి మండలం, సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన చాకలి సాయిలు ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. సాయిలు పొలం పనులు చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా, సుల్తాన్ పూర్ గేటు దగ్గర ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వ్యక్తులు.. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు కొత్తది కావడంతో టీఆర్ నెంబర్‌తో ఉంది. సాయిలు కటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.