చాలామంది నోటిని కంట్రోల్ చేసుకోలేరు. ఏదైనా ఇష్టమైంది కళ్లకు కనిపిస్తే చాలు తినాలని చూస్తారు. ఎంత తింటున్నాము అన్నది కూడా గమనించుకోకుండా ఇష్టారాజ్యంగా భుజిస్తారు. ఇక అటువంటి వారు తీవ్ర అనారోగ్యం బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా తినడం వల్ల అవాంఛిత బరువు పెరగవచ్చు . ఇంకా అధిక బరువు కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
1. ఊబకాయం: అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇంకా ఊబకాయంతో పలు ఇబ్బందులు వస్తాయి. వీటివలన గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం , అధిక రక్తపోటుతో సహా అనేక అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది.
2. జీర్ణక్రియ సమస్యలు: కడుపులో అసౌకర్యంగా ఉండి, యాసిడ్ రిఫ్లక్స్ , ఉబ్బరం వంటివి అతిగా తినడం వల్ల జీర్ణ రుగ్మతలు ఏర్పడుతాయి,
3. మెటబాలిక్ డిజార్డర్స్: అతిగా తినడం సాధారణ జీవక్రియ విధులకు ఆటంకం కలిగిస్తుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత , డైస్లిపిడెమియా (అసాధారణ రక్తంలో లిపిడ్ స్థాయిలు)కి దారితీసే అవకాశం ఉంది.
4. మానసిక ఆరోగ్య సమస్యలు : డిప్రెషన్, ఆందోళన ఏర్పడి సాధారణ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
5. పోషకాహార లోపాలు: అతిగా తినడం వల్ల పోషకాహార పదార్దాలను తినలేము. దీంతో శరీరంలో విటమిన్లు లోపించి.. వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. దీని వలన పలు రకాలు సమస్యలు ఏర్పడుతాయి.
6. కార్డియోవాస్కులర్ సమస్యలు: అతిగా తినడంతో, కొవ్వు , చక్కెర అధికమవుతుంది. దీంతో గుండె జబ్బులు , హార్ట్ అటాక్ వంటి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
7. భావోద్వేగ బాధ: అతిగా తినడం వల్ల అవమానం, దుఃఖం వంటి భావాలు కలుగుతాయి. ఈ భావోద్వేగాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంకా హానికరమైన ఆహారపు అలవాట్లకు కూడా దారితీస్తుంది.
బాగా నచ్చిందని విపరీతంగా తింటే ప్రమాదమే
తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్లు ఉపయోగించడం వంటి పనులు చేయకూడదు. భోజనాన్ని నెమ్మదిగా తినాలని సలహా ఇస్తున్నారు. భోజనానికి ముందు, భోజనం సమయంలో మరియు తర్వాత తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. జంక్ఫుడ్కు దూరంగా ఉండాలని అంటున్నారు. బాగా నచ్చిందని విపరీతంగా ఆహారం తీసుకోరాదని అంటున్నారు. ఈ సలహాలు పాటించి విపరీతంగా ఆహారాన్ని తీసుకునే అలవాటును తగ్గించుకోవడంతో పాటుగా, ఆరోగ్యంగా ఉండటంపై దృష్టి సారించాలని సలహా ఇస్తున్నారు.
ఆహారం ఏ విధంగా తీసుకోవాలో చెప్తున్న వైద్యులు
ఆహారాన్ని ఏ విధంగా తినాలి అన్న దానిపైన వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. తీసుకునే ఆహార పరిమాణంపై జాగ్రత్త వహించాలని, తాజా పండ్లు కూరగాయలను తినాలని చెప్తున్నారు. డిన్నర్ చెయ్యటానికి బదులుగా కట్ చేసుకున్న కూరగాయలను తినాలని, సలాడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని సలహా ఇస్తున్నారు.