పట్టా ఇవ్వనందుకే నిప్పంటించా.. నిందితుడు సురేశ్ స్టేట్మెంట్

పట్టా ఇవ్వనందుకే నిప్పంటించా.. నిందితుడు సురేశ్ స్టేట్మెంట్

భూ పట్టా కోసం రిక్వెస్ట్ చేసినా స్పందించలేదనే కారణంతోనే తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోలో పోసి నిప్పంటించానన్నాడు నిందితుడు సురేష్.  ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సురేష్ స్టేట్మెంట్ ను  రికార్డ్ చేశారు అబ్దుల్లాపుర్ మెట్ పోలీసులు. పట్టా కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నా తహసీల్దార్ విజయా రెడ్డి కనికరించలేదన్నాడు. సోమవారం కూడా విజయారెడ్డిని బతిమిలాడా కానీ కోర్టు కేసులు, జెసి ఆదేశాలు ఉన్నాయని.. తాను ఏమి చేయలేనని చెప్పిందని అన్నాడు. అయితే  ఎన్ని సార్లు విజయారెడ్డిని రిక్వెస్ట్ చేసినా కుదరదని చెప్పడంతో పెట్రోల్ బాటిల్ తో వెళ్లి ఆమె రూమ్ కి డోర్ లాక్ చేసి నిప్పంటించానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలనుకునే ఈ దారుణానికి పాల్పడ్డానని అన్నాడు. సురేష్ స్టేట్ మెంట్ తో ఐపీసీ 302 ,307 ,333 సెక్షన్ల  కింద కేసు నమోదు చేశారు పోలీసులు.