- సాంక్షన్డ్, ఖాళీలపై స్పష్టత
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్ల కేటగిరీలు ఫైనలయ్యాయి. గతంలో 155 కేటగిరిలుంటే, ప్రస్తుతం 300లకు పైగా పెరిగాయి. టీచర్ల క్యాడర్ స్ర్టెంత్పై సోమవారం అర్ధరాత్రి వరకు డీఈవోలు డైరెక్టరేట్లోనే ఉండి వర్క్ చేశారు. ఉమ్మడి జిల్లాలు, కొత్త జిల్లాల టీచింగ్, నాన్ టీచింగ్ వివరాలను ఫైనల్ చేస్తూ సర్టిఫై చేసి డైరెక్టర్కు పంపారు. ప్రస్తుతం డీఈవోలు ఇచ్చిన వివరాలను డైరెక్టరేట్లో మరోసారి వెరిఫై చేస్తున్నారు. తర్వాత రెండు, మూడ్రోజుల్లో వీటిని సర్కారుకు పంపనున్నారు.
కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్, నాన్ టీచింగ్ సాంక్షన్ పోస్టులు, వర్కింగ్ పోస్టుల వివరాలను సేకరించారు. దీంతో కొత్త జిల్లాల అలకేషన్కు లైన్ క్లీయర్ అయింది. ప్రస్తుతం కేటగిరీల మార్పుపైనే ఆఫీసర్లంతా దృష్టి పెట్టారు. గతంలో స్కూల్ అసిస్టెంట్ ఒకే కేటగిరీ ఉండగా, తర్వాత గవర్నమెంట్, లోకల్ బాడీ కేటగిరీలుగా మార్చారు.
ప్రస్తుతం సబ్జెక్ట్, మీడియం వారీగా మొత్తం 42 కేటగిరీలుగా మారినట్టు తెలిసింది. ఎస్జీటీల్లో ఏడు కేటగిరీలు, పీఈటీల్లో ఏడు కేటగిరీలుగా మార్చినట్టు సమాచారం. హెడ్మాస్టర్ కేటగిరీ మాత్రమే ఒక్కటిగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మంగళవారం నాటికి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల వివరాలు ఫైనల్ చేసినట్టు తెలిసింది. హెడ్ ఆఫీస్ ల పరిధిలోని పోస్టులపై ఇంకా వివరాలు తీసుకోలేదు.