
బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో బాలీవడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ బంధువులు కూడా ఉన్నారు. తాజాగా ఆయన వారి అంత్యక్రియలకు పాల్గొన్నారు. దాంతో ఈ విషయం బయటపడింది.
14 killed, 74 injured in this giant hoarding collapse in Mumbai’s dust storm yesterday.
— Shiv Aroor (@ShivAroor) May 14, 2024
The 17,000 sqft hoarding was listed in the Limca Book of Records last year. The BMC says it was illegal, unauthorised.
FOURTEEN lives gone & counting.
Banana republic. pic.twitter.com/uHqx0tW1in
ఇంతకు అసలు విషయం ఏంటంటే.. గత సోమవారం సాయంత్రం మంబయిలో భారీ వర్షం పడింది. ఆ సమయంలో భయంకరమైన ఈదురు గాలులు వీచాయి. ఆ గాలుల ధాటికి చాలా చెట్లు కుప్పకూలాయి. అలాగే.. ఘాట్కోపర్ లో సుమారు 250 టన్నులు బరువున్న భారీ హోర్డింగ్ కూడా పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో.. ఆ హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకోగా.. 16 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో హీరో కార్తిక్ ఆర్యన్ బంధువులు మనోజ్ చన్సోరియా(60), అనిత (59) కూడా ఉన్నారు. రీసెంట్ గా వారి అంత్యక్రియ కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ పాల్గొనడంతో ఈ విషయం బయటపడింది.