దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఇంకా ధృవీకరించలేదు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఇంకా ధృవీకరించలేదు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని తాము ఇంకా ధృవీకరించలేదని తెలిపింది రాష్ట ఎన్నికల సంఘం. నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. దీంతో ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని..  నాలుగు ఈవీఎంలు లెక్కించాల్సి ఉందని చెప్పింది. నాలుగు ఈవీఎంలలో దాదాపు 1669 ఓట్లు ఉన్నాయని.. వీవీ ప్యాట్లతో పోలైన ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. పూర్తి కౌంటింగ్ తర్వాతనే ఫైనల్ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపిన సీఈఓ శశాంక్ గోయల్..  రూల్స్ ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రస్తుతం 1470 ఓట్ల ఆధీక్యంలో ఉండటంతో దాదాపు విజయం ఖరారైనట్లేనని భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు.