కొన్ని గంటల్లో పెళ్లనగా.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు

కొన్ని గంటల్లో పెళ్లనగా.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు
సిరిసిల్ల జిల్లా: కొన్ని గంటల్లో పెళ్లనగా వధువు ప్రేమికుడిని పెళ్లి చేసుకునేందుకు వెళ్లి పోయింది. ఈ సంఘటన గురువారం సిరిసిల్ల జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. సిరిసిల్ల జిల్లా, తంగెళ్లపల్లికి చెందిన ప్రేమికులు లావణ్య, శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే లావణ్య తల్లిదండ్రులు గురువారం వేరే అబ్బాయితే పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో లావణ్య ..శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లెటర్ రాసి గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. లెటర్ చూసి షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లావణ్య కోసం వెతుకుతున్నామన్నారు.