హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని సర్కారు బడుల్లో పెరటి తోటల పెంపకంపై స్కూల్ఎడ్యుకేషన్ దృష్టిపెట్టింది. ప్రతి స్కూల్లో తప్పకుండా మునగ, కరివేపాకు చెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ ఆదేశాలను అమలు చేసేలా చూడాలని ఇటీవల డీఈఓలు, ఎంఈఓలకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్ లో వాడటానికి చెట్లు, మొక్కలు, కూరగాయల తోటలు పెట్టాలని ఇప్పటికే కేంద్రం రాష్ర్టాలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25వేల సర్కారు బడుల్లో సగం స్కూళ్లలో కూడా ఇది అమలు కావడం లేదు. దీంతో దీన్ని సీరియస్గా తీసుకున్న ఎంహెచ్ఆర్డీ కచ్చితంగా అమలు చేసేలా చూడాలని మరోసారి రాష్ర్టాలకు సూచించింది. దీంతో స్టేట్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది. అన్ని స్కూల్స్పరిసరాల్లో కనీసం ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ, చిక్కుడు, బచ్చలి తదితర తీగజాతి మొక్కలతో పాటు టమాట, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, మిర్చి, కొత్తిమీరతో పాటు పలు రకాల మొక్కలను నాటాలని ఎంఈఓలకు విద్యాశాఖాధికారులు ఆదేశాలిచ్చారు. వాటి నుంచి వచ్చే తాజా కూరగాయలను మిడ్ డే మీల్స్లో వడ్డించాలని కోరారు. బడుల్లో పెంచే పెరటితోటల ఫొటోలను స్కూల్ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కు పంపించాలని ఆదేశించారు. డీఈఓలు స్కూల్స్వారీగా ప్రతినెలా నివేదిక ఇవ్వాలని కోరారు.
స్కూళ్లలో కూరగాయలు పండిస్తరు
- తెలంగాణం
- December 19, 2019
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో