వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్దంగా కలెక్టర్ ప్రవర్తించారంటూ..విపక్షాలు చేశాయి. దీంతో కలెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలపై కోర్టులో పిటిషన్ ఉండగా.. EVMలను ఎలా తెరుస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
వికారాబాద్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కలెక్టర్ సుమారు వంద EVMలు సీల్ తీశారంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఈసీ… కలెక్టర్పై వేటు వేసింది.