ఛత్తీస్ గఢ్ లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఛత్తీస్ గఢ్ లో ఘనంగా  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఛత్తీస్ గఢ్ లో ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని రాయిపూర్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ పాల్గొన్నారు. సంప్రదాయ గిరిజన వేషధారణలో కనిపించారు బాగెల్. గిరిజన డోలు వాయిద్యాన్ని వాయించి అక్కడి గిరిజన కళాకారులను ఉత్సాహపరిచారు. బెంగాల్ లోని జార్ గ్రామ్ లో నిర్వహిస్తున్న ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. గిరిజనులతో కలసి డ్యాన్స్ చేశారు. ఢంకా బజాయించారు.