నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తాను ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు MLC  కడియం శ్రీహరి. కొంతమంది తనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా ఓబులపూర్ గ్రామంలో కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేతకానివాడు, ఒక్క రూపాయి సహాయం చేయనివాడు కూడా  తన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు కడియం. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని తెలిపారు కడియం.