NDA లో మహిళలకూ అవకాశం కల్పించాలి

NDA లో మహిళలకూ అవకాశం కల్పించాలి

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించకపోవడంపట్ల భారత సైన్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ విధాన నిర్ణయాలు లింగ వివక్షను చూపిస్తున్నాయని విమర్శించింది. వచ్చేనెల 5న నిర్వహించే NDA ప్రవేశ పరీక్షను మహిళలూ రాయవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చే తుది ఆదేశాలకు అనుగుణంగానే ప్రవేశాలను నిర్వహించాల్సిందిగా ఆర్మీని ఆదేశించింది.

NDA ప్రవేశ పరీక్షకు అమ్మాయిలనూ అనుమతించాలని తెలుపుతూ కుష్ కల్రా అనే వ్యక్తి పిటిషన్ ను దాఖలు చేశారు. అర్హులైన మహిళలను NDA లో చేరనివ్వకుండా రాజ్యాంగంలోని 14, 15, 16, 19 అధికరణాలను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్ లో తెలిపారు. ఇవాళ పిటిషన్ ను విచారించింది  సుప్రీంకోర్టు . అయితే మహిళల పట్ల ఎక్కడా వివక్ష చూపించట్లేదని కేంద్రం వాదించింది. సాయుధ దళాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది.

మీ ఆలోచనా విధానమే అసలు సమస్య. ప్రభుత్వం వెంటనే దానిని మార్చుకుంటే మంచిది. మేం ఆదేశాలిచ్చే వరకు తెచ్చుకోవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిందేనని, ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే మార్చాలని ఆదేశించింది. అవకాశాలను కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పునిచ్చినా అమలు చేయరా? అని జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నించారు. ఆర్మీలో మహిళలకు అవకాశాల కోసం పర్మనెంట్ కమిషన్ వేయాలన్న జస్టిస్ ఆదేశాలను అమలు చేయరా? అంటూ నిలదీశారు.