
డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్టార్స్ లిస్టులో చేర్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వైర్ డీజే టిల్లును మించి విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సిద్ధు క్రేజ్ అమాంతం పెంచేసింది. దీంతో.. వరుసగా క్రేజీ ఆఫర్స్ కు ఒకే చేస్తున్నాడు సిద్దు.
అయితే.. తాజాగా సమాచారం ప్రకారం సిద్దు తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారట. డీజే టిల్లు వరకు ఐదు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సిద్దు.. టిల్లు స్క్వైర్ సక్సెస్ తరువాత తన రెమ్యునరేషన్ త్రిబుల్ చేశాడట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సిద్దు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలుసుకున్న సిద్దు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సక్సెస్ ఇచ్చే కిక్కి ఇలాగె ఉంటుంది. సిద్దు భయ్యా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సిద్దు జొన్నలగడ్డ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుత ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న జాక్. ఎస్వీసీసీ బ్యానర్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తరువాతి సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకతంలో వస్తున్న ఈ సినిమా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు సిద్దుకి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.