తెలంగాణలో ఒక్కరోజే 1058 కేసులు

తెలంగాణలో ఒక్కరోజే 1058 కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1058 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో   2 లక్షల 60 వేల 834 కి పెరిగింది. మరణాల సంఖ్య 1419 కి చేరింది. ప్రస్తుతం 12 వేల 682 యాక్టివ్ కేసులు ఉన్నట్లు హెల్త్ బులెటిన్ లో తెలిపింది సర్కార్.  వైరస్ నుంచి నిన్న 1440 మంది కోలుకున్నారు…దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2 లక్షల 46 వేల 733 కు చేరింది. నిన్న 38  వేల 757 మందికి టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 50 లక్షల 11 వేల, 164 చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 168 ,మేడ్చల్ మల్కాజ్ గిరిలో 93,రంగరెడ్డిలో 91 నమోదయ్యాయి.