గంజాయి పీల్చిన 11 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సస్పెండ్

గంజాయి పీల్చిన 11 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సస్పెండ్

వరంగల్ నిట్  లో గంజాయి సేవించిన 11 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారు. వారం రోజుల క్రితం నిట్ లో గంజాయి సేవిస్తూ.. 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. ఈవార్త బయటకు రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై విచారణకు డీన్ తో కమిటీ వేశారు అధికారులు. డీన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు విచారణ జరిపారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థులు అక్టోబర్ 26న రాత్రి నిషేదిత గంజాయి సేవించారని తేల్చారు. దీంతో వారిపై ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోతారని తెలిపారు నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు. తిరిగి జులై 2020 సంవత్సరంలో రీఅడ్మిషన్ తో ఫస్టియర్ లోనే జాయిన్ కావాల్సి ఉంటుందని చెప్పారు.