క్రేన్ బోల్తాపడి ముగ్గురు మృతి

క్రేన్ బోల్తాపడి ముగ్గురు మృతి

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో క్రేన్ బోల్తా పడి ముగ్గురు చనిపోయారు. ఆగస్టు 15 కోసం గ్వాలియర్ లోని పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ పై జాతీయ జెండాను బిగించేందుకు పనులు చేపట్టారు. దీనికోసం ఓ హైడ్రాలిక్ క్రేన్ ను తీసుకొచ్చారు మున్సిపల్ సిబ్బంది. దానిపై ఎక్కి జెండా బిగించేందుకు పని చేస్తుండగా... హైడ్రాలిక్ క్రేన్ బోల్తా పడింది. దీంతో ముగ్గురు మున్సిపల్ సిబ్బంది చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మధ్యప్రదేశ్ మంత్రి తులసి రామ్ సిలావత్ చెప్పారు.