లడాఖ్‌లో భూకంపం.. రెక్టార్‌‌ స్కేల్‌పై 4.5గా నమోదు

లడాఖ్‌లో భూకంపం.. రెక్టార్‌‌ స్కేల్‌పై 4.5గా నమోదు

లడాఖ్‌: లడాఖ్‌లోని నార్త్‌ – నార్త్‌వెస్ట్‌ కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రెక్టార్‌‌ స్కేల్‌పై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు చెప్పారు. లడాఖ్‌లో25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, ఎన్‌సీఎస్‌ చెప్పింది. హిమాయా రీజన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. పోయిన వారం 4.5 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు.