రాత్రి ఆలుగడ్డ కూర తిన్నారు.. ఆస్పత్రిలో చేరారు

రాత్రి ఆలుగడ్డ కూర తిన్నారు.. ఆస్పత్రిలో చేరారు

జగిత్యాల భవానీ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  రాత్రి  తిన్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. రాత్రి హాస్టల్ లో విద్యార్థులు ఆలుగడ్డ కూర, పెరుగుతో అన్నం తిన్నారు. అయితే అది తిన్న కాసేపటికే కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. మొత్తం 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు  22 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో 19 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.