పరీక్ష హాల్లో బట్టలు విప్పించి తనిఖీ : బాలిక ఆత్మహత్య

పరీక్ష హాల్లో బట్టలు విప్పించి తనిఖీ : బాలిక ఆత్మహత్య

చత్తీస్ గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లో తనిఖీలు చేయడానికి వచ్చిన ఇన్ స్పెక్టింగ్ అధికారులు… పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అమ్మాయి విషయంలో అతిగా ప్రవర్తించారు. చిట్టీలు పెట్టిందేమో అనే సందేహంతో… ఆమె బట్టలు విప్పించి తనిఖీ చేశారు. ఈ సంఘటన ఈనెల 4వ తేదీన జష్ పూర్ అనే పట్టణంలో జరిగింది. ఇది అవమానంగా భావించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీంతో… విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమంటూ ఖండించిన అధికారి రవి మిట్టల్… సంఘటనపై దర్యాప్తు జరిపిస్తామని.. బాధ్యులను చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు.