చత్తీస్ గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ లో తనిఖీలు చేయడానికి వచ్చిన ఇన్ స్పెక్టింగ్ అధికారులు… పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అమ్మాయి విషయంలో అతిగా ప్రవర్తించారు. చిట్టీలు పెట్టిందేమో అనే సందేహంతో… ఆమె బట్టలు విప్పించి తనిఖీ చేశారు. ఈ సంఘటన ఈనెల 4వ తేదీన జష్ పూర్ అనే పట్టణంలో జరిగింది. ఇది అవమానంగా భావించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీంతో… విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమంటూ ఖండించిన అధికారి రవి మిట్టల్… సంఘటనపై దర్యాప్తు జరిపిస్తామని.. బాధ్యులను చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు.
Jashpur: A class 10th student committed suicide after being allegedly strip searched during her board exam by the inspecting officials. SDM Ravi Mittal says, 'We will investigate the incident, it's condemnable. Students need not worry.' (04-03-19) #Chhattisgarh pic.twitter.com/yRAnQK811K
— ANI (@ANI) March 7, 2019