గోవధ చేసినందుకు ముగ్గురిపై కేసు

గోవధ చేసినందుకు ముగ్గురిపై కేసు

జోగిపేట, వెలుగు: జోగిపేట మున్సిపల్ పరిధిలో గోవధ చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరాజాగౌడ్ తెలిపారు. అందోల్ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గోవధ చేస్తున్న దృశ్యాలను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసి జోగిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. దీంతో గోవధ నిషేధ చట్టం కింద ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లుఎస్సై వెంకటరాజ గౌడ్ తెలిపారు.