Ram Pothineni: OTT ఎంట్రీ ఇస్తున్న ఉస్తాద్ రామ్.. టాప్ సంస్థలో క్రేజీ ప్రాజెక్టు

Ram Pothineni: OTT ఎంట్రీ ఇస్తున్న ఉస్తాద్ రామ్.. టాప్ సంస్థలో క్రేజీ ప్రాజెక్టు

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni)  ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri jagannadh) తో డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమా చేస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే డబుల్ ఇస్మార్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీ రోల్ చేస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

అయితే.. ఈ సినిమా తరువాత రామ్ చేయబోయే ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. రామ్ తన తరువాతి సినిమాతో OTTలో ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ హీరోలు ఓటీటీలో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో నడువనున్నాడట రామ్. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు వచ్చిందట. రామ్ తో ఒక క్రేజీ వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమైందట.

దీనికి సంబందించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. మే 15న రామ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి మొదటిసారి ఓటీటీలో అడుగుపెడుతున్న రామ్ ఎలాంటి కంటెంట్ ను ఒకే చేస్తాడు, ఏ దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తారు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది.