- 34 లక్షల 83వేల 236 కోట్లతో భారీ బడ్జెట్
- ‘క్లీన్ ఇండియా.. హెల్తీ ఇండియా’కు పెద్ద పీట
కరోనా ఎఫెక్ట్తో దెబ్బతిన్న ఎకానమీని గాడిలో పెట్టే పని చేశారు నిర్మలమ్మ. పన్నుల బాదుడు లేకుండా అన్ని రంగాలకు బూస్టప్ ఇచ్చేలా సోమవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘క్లీన్ ఇండియా.. హెల్తీ ఇండియా’, ‘సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్’ నినాదాలతో 2021-22 ఫైనాన్స్ ఇయర్కు ఆరు పిల్లర్ల ఫార్ములా ప్రకటించారు. దాని ఆధారంగా కేటాయింపులు జరిపారు. పబ్లిక్ హెల్త్కు పెద్ద పీట వేశారు. సాగుకు సాతిచ్చారు. ఇల్లు కట్టుకునెటోళ్లకు గతంలోని లోన్ రిలాక్సేషన్స్ కొనసాగుతాయని చెప్పారు. ట్యాక్స్ పేయర్లకు కూడా పాత శ్లాబులే అమలు కానున్నాయి. కాలుష్యం, రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ‘స్క్రాపేజీ పాలసీ’ని ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, డిఫెన్స్.. ఇట్ల ప్రతి సెక్టార్కు ప్రయార్టీ ఇచ్చారు. బీమా రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీస్తూ.. 49 శాతం ఉన్న ఎఫ్డీఐలను 74 శాతానికి పెంచారు. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతోపాటు ఎల్ఐసీని ఐపీవోకి తెస్తామన్నారు. పెట్రోల్, డీజిల్పై అగ్రి ఇన్ఫ్రా సెస్ వేశారు. అయితే.. అది కస్టమర్స్పై ఎఫెక్ట్ చూపదని చెప్పారు. మొత్తంగా గంటా 50 నిమిషాల పాటు సాగిన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ నచ్చడంతో స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకుపోయాయి.
ఆరోగ్యం & శ్రేయస్సు
- పీఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్ యోజన ను కేంద్రం లాంచ్ చేసింది. ఈ పథకానికి రూ.64 వేల కోట్లు కేటాయించింది.
- జల్ జీవన్ మిషన్ అర్బన్ స్కీమ్ను ప్రారంభించింది.
- అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ను కూడా లాంచ్ చేసింది.
- పొల్యూషన్ను తగ్గించేం దుకు వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని మొదలుపెట్టింది.
- ఏటా 50 వేల మంది చిన్నారుల మరణా లను తగ్గించేందుకు న్యుమోకోకల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం.
- మిషన్ పోషన్ 2.0 లాంచ్ చేశారు
- సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ & పోషణ్ అభియా న్ల విలీనం.
పెట్టుబడులు &మౌలిక వసతులు
- మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్స్కోసం ప్రత్యేక స్కీమ్ను తీసుకురావడం.
- పీఎల్ఐ స్కీమ్నులాంచ్ చేయడం.
- వచ్చే మూడేండ్లలో 7 టెక్స్టైల్ పార్క్స్ను ఏర్పాటు.
- ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు. చేయడం. ఇందుకు రూ.20 వేల కోట్లు కేటాయింపు.
- 2022 జూన్ నాటికి వెస్ట్రన్ రవాణా కారిడార్, ఈస్టర్న్ రవాణా కారిడార్ను ప్రారంభించడం.
- 2023 డిసెంబర్ నాటికి రైల్ బ్రాడ్గేజ్ రూట్లను వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడం.
- పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కోసం 18 వేల కోట్లతో స్కీమ్
- పీపీపీ పద్ధతిలో రూ.2 వేల కోట్లతో 7 పోర్ట్ ప్రాజెక్టులు
- 2024 నాటికి షిప్ రీసైక్లింగ్ కెపాసిటీని రెట్టింపు చేయడం
- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లోకి మూడేండ్లలో మరో వంద జిల్లాలను తీసుకురావడం
- ఇన్సూరెన్స్ యాక్ట్ 1938కి సవరణలు చేసి ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎఫ్డీఐలను 49 నుంచి 74 శాతానికి పెంచడం.
- బ్యాంక్ కస్టమర్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ను లక్ష నుంచి 5 లక్షలకు పెంచడం
- ఎన్సీఎల్టీ ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడం, ఈ కోర్ట్ సిస్టంను అమలులోకి తేవడం.
- ఎల్ఐసీ ఐపీవోను అందుబాటులోకి తేవడం, 2021–22 నాటికి ఐడీబీఐ, ఎయిరిండియా డిస్ ఇన్వెస్ట్మెంట్ను పూర్తి చేయడం.
అన్ని రంగాల్లో ప్రగతి
- స్వామిత్వ స్కీమ్ను 2021–22 ఆర్థిక సంవత్సరానికి పొడిగించారు. అన్ని రాష్ట్రాలు, ఈ స్కీమ్ కవర్ అవుతుంది.
- అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ను రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ణయించారు. డైరీ, ఫిషరీస్ సెక్టార్లపై ఫోకస్ చేస్తారు.
- రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు కేటాయింపులను రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు.
- మైక్రో ఇరిగేషన్ ఫండ్కు అదనంగా 5 వేల కోట్లు
- ఈ–నామ్లోకి మరో వెయ్యి మండీలను చేర్చడం
- అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ను ఏపీఎంసీలు వాడుకునే వీలు
- కొచ్చి, చెన్నై, వైజాగ్, పారాదీప్, పెతువాఘాట్ల్లో ఐదు మేజర్ ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయడం.
- బిల్డింగ్, కనస్ట్రక్షన్, ఇతర వర్కర్లకు హెల్త్, హౌసింగ్, ఇన్స్యూరెన్స్, క్రెడిట్, ఫుడ్ స్కీమ్లు అందేలా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి.. వలస కార్మికుల వివరాల సేకరణ.
- అన్ని కేటగిరీల వర్కర్లకు కనీస వేతనం వర్తింపు. వారందరికీ ఈఎస్ఐ వర్తింపజేయడం
- అన్ని కేటగిరీల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి. నైట్ షిఫ్ట్ల్లో అవసరమైన రక్షణ చర్యలు కల్పించడం
- ఎంఎస్ఎంఈ సెక్టార్కు రూ.15,700 కోట్లు
మానవ వనరుల బలోపేతం
- చిన్నారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేలా దేశంలోని దాదాపు 15 వేల స్కూళ్లను బలోపేతం.
- దేశవ్యాప్తంగా కొత్తగా వంద సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
- హయ్యర్ ఎడ్యుకేషన్కు ప్రోత్సాహం అందించేలా అంబ్రెల్లా బాడీని ఏర్పాటు చేయడానికి చట్టం.
- లేహ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు
ఇన్నోవేషన్, రీసెర్చ్ & డెవలప్మెంట్
- నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం ఐదేండ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
- డిజిటల్ మోడ్లో చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అందించేందుకు రూ.1,500 కోట్లతో ప్రత్యేక స్కీమ్ను తీసుకువస్తారు.
- నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్(ఎన్టీఎల్ఎం) ను లాంచ్ చేస్తారు.
- గగన్ యాన్ మిషన్ను ముందుకు తీసుకెళ్తారు. నలుగురు ఇండియన్స్ఆస్ట్రోనాట్స్కు స్పేస్లో పరిస్థితులపై రష్యాలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. 2021 డిసెంబర్లో మానవరహిత మిషన్ను లాంచ్ చేస్తారు.
- సముద్ర గర్భంలోని అరుదైన జీవజాలాన్ని కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. రూ.4 వేల కోట్లతో ఐదేండ్ల పాటు సముద్ర గర్భంలో సర్వే నిర్వహిస్తారు.
మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమం గవర్నెన్స్
- నేషనల్ నర్సింగ్ బిల్లును త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
- కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మెకానిజంను అందుబాటులోకి తేవడం.
- జనాభా లెక్కలను తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టడం. 2021–22 కోసం రూ.3,768 కోట్ల కేటాయింపు.
- పోర్చుగీస్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన గోవా డైమండ్ జూబ్లీ వేడుకల కోసం రూ.300 కోట్ల కేటాయింపు.
- అస్సాం, వెస్ట్ బెంగాల్లోని టీ వర్కర్లు.. ముఖ్యంగా మహిళలు, వారి పిల్లల సంక్షేమం కోసం రూ.1,000 కోట్ల కేటాయింపు