వంద మంది కేసీఆర్‌‌లు ఉన్నా ఏం చేయలేకపోయేవారు

వంద మంది కేసీఆర్‌‌లు ఉన్నా ఏం చేయలేకపోయేవారు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి కోరారు. ‘నేను విమానం లో వెళ్తుంటే చూశా. తెలంగాణ అంతటా పచ్చగా కనిపించింది. లక్షల కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌‌లు కట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తర్వాత సీఎం కేసీఆరే హైదరాబాద్‌‌లో మతకలహాలు లేకుండా చేశారు. కేసీఆర్‌‌కు కొంత మంది ఆంధ్రా లీడర్ల మీదనే కోపం.. కానీ ప్రజల మీద కాదు. కేసీఆర్ మంచి పనులు చేశారు.. అలాగే కొన్నింటిని చేయలేకపోయారు. నిధులు లేని కారణంగా కొన్ని పనులు మెల్లగా జరుగుతున్నాయి. వందేళ్ల క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షం వస్తే నిజాం నవాబ్ ఒక్కరినీ కాపాడలేదు. కానీ కేసీఆర్ మాత్రం తన వంతు ప్రయత్నం చేశారు. ప్రజలు, చోటా మోటా నేతలే నాలాలు కబ్జా చేశారు. వచ్చిన వరదకు వంద మంది కేసీఆర్‌‌లు ఉన్నా ఏమీ చేయలేకపోయేవారు. టీఆర్‌ఎస్‌‌ను గెలిపిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఆరేళ్లలో జరగాల్సిన డెవలప్‌‌మెంట్ జరిగింది. అన్ని పనులు ఒకేసారి కావాలంటే ఎవరికి సాధ్యం కాదు’ అని పోసాని పేర్కొన్నారు.