రామాలయ నిర్మాణానికి డబ్బులివ్వకుంటే బెదిరిస్తారా?

రామాలయ నిర్మాణానికి డబ్బులివ్వకుంటే బెదిరిస్తారా?

బెంగళూరు: అయోధ్య రామాలయ నిర్మాణానికి డొనేట్ చేయలేదని తనను కొందరు బెదిరిస్తున్నారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. ఒక మహిళతోపాటు ముగ్గురు పురుషులు తన ఇంటికి వచ్చారని, రామాయల నిర్మాణానికి డబ్బులు ఇవ్వనుందుకు బెదిరించారని తెలిపారు. ‘ఎవరు సమాచారం ఇస్తున్నారు? అసలు నిజాయితీ ఉందా? కొందరు ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను కూడా ఓ బాధితుడినే. ఒక మహిళ, ముగ్గురు పురుషులు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించారు. నేనెందుకు డబ్బులు ఇవ్వట్లేదని అడిగారు. విశ్వ హిందూ పరిషత్‌‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.