
చాలామంది హీరోలకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. అజిత్కి కూడా ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు పొంగల్కి రిలీజై సూపర్ హిట్టు కొట్టాయి. అందుకే తనతో సినిమా తీసే ప్రతి నిర్మాత ఆ పండుగ సీజన్పై ఓ కన్నేసి ఉంచుతాడు. బోనీ కపూర్ కూడా అదే చేశారు. అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న ‘తునివు’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు నిన్న ప్రకటించారు. 1987లో జరిగిన లూథియానా బ్యాంక్ దోపిడీ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో రిలీజ్ విషయమై క్లారిటీ ఇచ్చేశారు బోనీ.
అయితే విజయ్ ‘వారిసు’ మూవీ ఆల్రెడీ పొంగల్ రేసులో ఉంది. తమిళనాట ఈ ఇద్దరి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా ప్రతి సంక్రాంతికీ ఇద్దరి సినిమాలూ పోటీపడుతుండటంతో ఓ రేంజ్లో టెన్షన్ నెలకొంటుంది. దాంతో ఈ అనౌన్స్మెంట్పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అయితే ఇది వీరిద్దరితోనే అయిపోలేదు. ‘ఆదిపురుష్’ లాంటి భారీ ప్యాన్ ఇండియా చిత్రాలు కూడా ఆ సమయంలో బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధం ఖాయమేననిపిస్తోంది.