హైదరాబాద్, వెలుగు: అన్నారం పంపు హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. జులై 14న గోదావరికి భారీ వరద రావడంతో అన్నారం పంపుహౌస్ నీటిలో మునిగిపోయింది. నదిలో వరద తగ్గాక డీవాటరింగ్ చేసి, బురదలో కూరుకుపోయిన పంపులను బయటకు తీశారు. రూ.20 కోట్ల విలువైన కంట్రోల్ ప్యానళ్లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అడిషనల్ టీఎంసీ కోసం తెప్పించిన కొత్త కంట్రోల్ ప్యానళ్లను ఏర్పాటు చేసి, మోటార్ల ట్రయల్ రన్కు ప్రయత్నించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పంపుహౌస్లోని ఒకటో మోటారును సక్సెస్ఫుల్గా నడిపించారు. పంపుహౌస్లోని మిగతా మోటార్లను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకొస్తామని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, ఇంజినీర్లను మంత్రి హరీశ్రావు అభినందించారు.