శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో శవం

శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో శవం

యాదాద్రి : బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఘటన మరువకముందే మరో అమ్మాయి మృతదేహం బావిలో పోలీసులు గుర్తించారు. నెలరోజుల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన మనీషా అనే డిగ్రీ విద్యార్థిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని బావిలోంచి తీయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లను తరలిస్తున్నామని తెలిపి పోలీసులు.. హైదరాబాద్ నుంచి హాజీపూర్  సీపీ మహేష్ భగవత్ వస్తున్నారన్నారు. హజ్ పూర్ బావిలో వరుసగా అమ్మాయిల డెడ్ బాడీలు కనిపించడంతో స్థానికంగా కలకం రేపింది. మరో అమ్మాయి కూడా కనిపించకుండా పోయిందని పోలీసులకు తెలుపుతున్నారు గ్రామస్తులు.

శ్రావణి మృతదేహం లభించిన బావిలోనే మరో శవం ఉందన్న సమాచారంతో బావిలో వెతుకిన పోలీసులకు మరో శవానికి సంబంధించిన అస్తికలు లభించాయి. ఆ అస్తికలు హాజీపూర్ గ్రామానికి చెందిన మనీషా(18) గా గుర్తించారు పోలీసులు. పోలీసుల సోదాల్లో బావిలో దొరికిన అస్తికలను ఐదు వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్ చేసి పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మనీషా కీసరలోని KLR కాలేజీలో బీ.కామ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో దొరికిన అస్తికలను ఐదు వేర్వేరు బ్యాగుల్లో భద్రపర్చడంతో ఆ అస్తికలన్నీ మనీషాయేనా, వేరే వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులయా అన్న కోణం పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగాని ఆ అస్తికలు ఎవరెవో తెలుస్తుందన్నారు. 2015 లో ఇదే మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన కూడా అదృశ్యం కావడంతో, ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.